కేటీఆర్‌తో ఆస్ట్రేలియా కాన్సులేట్‌ జనరల్‌ భేటీ

16 Apr, 2018 12:42 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో ఆస్ట్రేలియా కాన్సులేట్ జనరల్ సుసాన్ గ్రేస్ భేటీ అయ్యారు. ఈ భేటీలో ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్‌రావు, ప్రిన్సిపల్ సెక్రటరీలు అరవింద్ కుమార్, జయేష్ రంజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ రాష్ట్రంలో ఉన్న వ్యాపార అనుకూల వాతావరణాన్ని వివరించారు. మౌలిక వసతులు, క్రీడలు, ఐటీ రంగాల్లో ఆస్ట్రేలియా కంపెనీలు పెట్టుబడులు పెట్టాలని మంత్రి కోరారు. మహిళా వ్యాపారవేత్తల కోసం వి-హబ్ ఏర్పాటు చేసినందుకు కేటీఆర్‌ను సుసాన్ గ్రేస్ అభినందించారు. ఈ భేటీలో ట్రేడ్ కమిషనర్ మునీష్ శర్మ కూడా పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు