ఆటో బోల్తా..15 మందికి గాయాలు

1 Jan, 2016 14:41 IST|Sakshi

బెల్లంపల్లి: ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో శుక్రవారం మధ్యాహ్నం ఓ ఆటో ట్రాలీ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో 15 మందికి తీవ్రగాయాలు కాగా..అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారంతా రెబ్బన మండలం పులికుంట గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. బెల్లంపల్లిలోని బుగ్గదేవాలయానికి వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు