గుడుంబాపై అవగాహన

28 Sep, 2015 17:02 IST|Sakshi

గుడుంబా తాగడం వల్ల వచ్చే అనర్థాల గురించి పోలీసులు, ఎక్సైజ్ అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గునగల్ గ్రామంలో సోమవారం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. గ్రామంలో గుడుంబా తయారీ కేంద్రాలు అధికంగా ఉండటంతో వాటిని ధ్వంసం చేయకుండా.. వాటి వల్ల కలిగే అనర్థాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.
 

మరిన్ని వార్తలు