చెరువులో పసికందు మృతదేహం

7 Mar, 2016 14:39 IST|Sakshi

రంగారెడ్డి జిల్లా కుల్కచర్ల మండలం కొత్తపల్లి గ్రామ చెరువులో ఆదివారం రాత్రి ఆడశిశువు మృతదేహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. సోమవారం ఉదయం అటుగా వెళ్లిన స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు.
 

మరిన్ని వార్తలు