హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారులు సింధు, కోచ్ గోపీచంద్ లు కలిశారు. క్రీడలకు ప్రోత్సాహం అందిస్తున్న కేసీఆర్ ను సింధు, గోపిచంద్ లు అభినందించారు.
కేసీఆర్ తో భేటి అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. క్రీడలకు కేసీఆర్ మంచి ప్రోత్సాహకం ఇస్తున్నారు. ఏషియన్ గేమ్స్లో మరింత ప్రతిభ కనబరచాలని సీఎం కోరారు. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ గెలిచినందుకు అభినందించారు అని తెలిపారు.