రిసార్ట్స్లో రేవ్ పార్టీ జరిగింది: డీసీపీ

24 Oct, 2014 14:31 IST|Sakshi

మేడ్చల్ :  రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం మేడ్చల్ మండలం మురారిపల్లిలోని హనీబర్గ్ రిసార్ట్స్లో గతరాత్రి రేవ్ పార్టీ జరిగిందని బాలనగర్ డీసీపీ శ్రీనివాస్ ధ్రువీకరించారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనలో ఏడుగురు నైజీరియర్లతో పాటు మరో ఏడుగురు బౌన్సర్లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కాగా అసాంఘిక చర్యలకు పాల్పడుతున్న రిసార్ట్స్పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీసీపీ చెప్పారు. పోలీసుల దాడుల నేపథ్యంలో పలువురు యువతులు తప్పించుకున్నారని ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు