ఎలుగుబంటి దాడిలో రైతుకు తీవ్రగాయాలు

5 Sep, 2015 20:20 IST|Sakshi

ఆమ్రాబాద్ (మహబూబ్‌నగర్ జిల్లా) : ఎలుగుబంటి దాడిలో ఓ రైతుకు తీవ్ర గాయాలయ్యాయి. మహబూబ్‌నగర్ జిల్లా ఆమ్రాబాద్ మండలం ముక్తేశ్వరం గ్రామానికి చెందిన రైతు ముక్త్యాలు(40) శనివారం సాయంత్రం పొలంలో వ్యవసాయ పనుల్లో ఉన్నాడు. కాగా రాత్రి 7 గంటల సమయంలో సమీప అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఓ ఎలుగుబంటి అతడిపై దాడికి దిగింది. సమీపంలోనే ఉన్న రైతులు వెంటనే కర్రలతో వచ్చి ఎలుగుబంటిని పారదోలారు. ఎలుగుబంటి దాడిలో తీవ్రంగా గాయపడిన ముక్త్యాలును అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు