పశువులకాపరిపై ఎలుగు దాడి

14 Sep, 2015 19:49 IST|Sakshi

అమ్రాబాద్ (మహబూబ్ నగర్) : ఓ పశువులకాపరిపై ఎలుగుబంటి దాడి చేసిన సంఘటన సోమవారం సాయంత్రం అమ్రాబాద్ మండలంలోని కొత్తపల్లి అడవిప్రాంతంలో జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన ప్రకారం... కొత్తపల్లి గ్రామానికి చెందిన మాధ్య అనే పశువుల కాపరి గ్రామ వ్యవసాయ పొలాల సమీపంలోని అడవి ప్రాంతంలో పశువులను మేపుతున్నాడు.

ఈ క్రమంలో పొదల్లో ఉన్న పిల్లల ఎలుగుబంటి అకస్మాత్తుగా అతడిపై పడి దాడి చేసింది. తోటిపశువుల కాపరుల అరుపులతో ఎలుగుబంటి పారిపోయింది. ఈ సంఘటనలో మాధ్యకు తల, శరీరభాగాలకు తీవ్రగాయాలు కాగా ప్రైవేట్ వాహనంలో అచ్చంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు