టీఆర్‌ఎస్ నాయకులపై తేనెటీగల దాడి

29 Apr, 2015 19:07 IST|Sakshi
టీఆర్‌ఎస్ నాయకులపై తేనెటీగల దాడి

నిజామాబాద్: మిషన్ కాకతీయ పనులు ప్రారంభించడానికి వచ్చిన ప్రభుత్వ విప్ కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్దన్ బృందంపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా బిచ్‌కుంద మండలం చీకోటివానికుంటలో బుధవారం జరిగింది. వివరాలు.. ప్రభుత్వ విప్ గంప గోవర్దన్ మిషన్ కాకతీయ పనులు ప్రారంభిస్తున్న సమయంలో కుంట సమీపంలోని చింత చెట్టుమీద ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా విజృంభించాయి. ఈ దాడిలో టీఆర్‌ఎస్ కార్యకర్తకు ఒక హోంగార్డులపై తేనెటీగలు దాడి చేయడంతో వారికి గాయాలయ్యాయి.

మరిన్ని వార్తలు