బీడీ కార్మికుల ఆందోళన

1 Jun, 2015 15:04 IST|Sakshi

కోనరావుపేట (కరీంనగర్ జిల్లా) : తమ సమస్యలను తీర్చాలని కోరుతూ బీడీ కార్మికులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటన సోమవారం కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో జరిగింది. ఈ ఆందోళనలో భాగంగా బీడీ కార్మికులు మండలంలోని పంచాయతీ కార్యాలయానికి తాళం వేశారు. అనంతరం పెద్ద సంఖ్యలో ఎంపీడీవో కార్యాలయం వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు