బీజేపీ గెలుపుతోనే సుస్థిర పాలన’

28 Nov, 2018 18:34 IST|Sakshi
ఎక్లాస్‌పూర్‌లో ప్రచారం చేస్తున్న అరుణ

సాక్షి,నారాయణపేట రూరల్‌: రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే అభివృద్ధి పరుగులు పెడుతుందని జెడ్పీటీసీ సభ్యురాలు లప్ప అరుణ అన్నారు. మంగళవారం నారాయణపేట మండలం ఎక్లాస్‌పూర్, శేర్నపల్లి, సింగారం, అప్పిరెడ్డిపల్లి గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటి వరకు అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారని ఈ సారి బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కమలం గుర్తుకు ఓటు వేసి కొత్తకాపు రతంగపాండురెడ్డిని అసెంబ్లీకి పంపాలని కోరారు. ఇందులో చెర్ల గుండప్ప, నాగిరెడ్డి, బాల్‌రెడ్డి, అశోక్, తిప్పమ్మ, పిల్లి నర్సింహులు, బాలవర్ధన్, మణెమ్మ, కతలప్ప, రామకృష్ణ పాల్గొన్నారు. 
ఉధ్యమ పార్టీకి పట్టం కట్టాలి 
వ్యాపారాల కోసం రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తులకు కాకుండా సేవా భావంతో ప్రజల మధ్య ఉండి ఉద్యమాలు చేసిన నాయకుడు రతంగపాండురెడ్డిని గెలిపించాలని ఆయన భార్య రత్నమాల విజ్ఞప్తి చేశారు.  రైతులకు రుణమాఫీ, 12వేల ఫీజు రియాంబర్స్‌మెంట్, 14రకాల పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. రఘురామయ్యగౌడ్, రఘువీర్‌యాదవ్, లక్ష్మి, రాజు, సతీష్‌గౌడ్, వెంకటేష్‌గౌడ్, శేఖర్, రవి, సాయిరామ్, మణి, నాగరాజ్, ఆదిత్య, చైతన్య, అనిల్, కళ్యాణ్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు