బీజేపీతోనే సమన్యాయం

7 Nov, 2018 13:02 IST|Sakshi

     ప్రచారంలో బీజేపీ నాయకులు

     హామీలు గుప్పిస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి కొండయ్య  

సాక్షి,మక్తల్‌:  ప్రజలు తమను ఆశీర్వదిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొండయ్య అన్నారు. మంçగళవారం మక్తల్‌ పట్టణంలో వివిధ పార్టీలకు చెందిన యువకులు  ఎన్నికల  ప్రచారం చేసి తనను అశిర్వాదించాలని, కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. తనపై నమ్మకం పెట్టి అందరు ఓటు వేయాలని కోరారు.బిజేపిని గెలిపించేందుకు  ఎన్నికల్లో అందరు సైనికూల్లా పని చేసి బిజేపి పార్టీని గెలిపించాలని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జి.నింగిరెడ్డి, ఊట్కూర్‌ భాస్కర్,   జిల్లా ఉపాధ్యక్షుడు సోంశేఖర్‌గౌడ్, అసేంబ్లి కన్వీనర్‌ కుర్వహన్మంతు, జిల్లా కార్యదర్శి నాగప్ప, సోంశేఖర్‌గౌడ్, ప్రతాప్‌రెడ్డి, లక్ష్మణ్, మల్లికార్జున్, అసేంబ్లీ మీడియా ఇన్‌చార్జ్‌ నరేందర్‌సాగర్, ఈసరినాగప్ప, నిజాం, ఇస్మాయిల్, రాజు, పాండు, వాకిటి ఆంజనేయులు, వెంకటయ్య, రవి, నరేంద్ర. చంటీ, క్రిష్ణ, లక్ష్మణ్, రాంమాదవ్, పూలశ్రీను, చీరాల సత్యనారాయణ, మంజునాథ్, వెంకటేష్,తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డి, చిట్యాల లక్ష్మణ్, మెహన్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. 


పునరావాస గ్రామాలకు న్యాయం చేస్తా 
మాగనూర్‌: నియోజకవర్గంలోని పునరవాస గ్రామాలైన నేరడగం, ఉజ్జెల్లి, బూత్పుర్‌ గ్రామాల ప్రజల ఇబ్బందులను పరిష్కరిస్తూ ఆ గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని బీజేపీ అభ్యర్థి కొండయ్య అన్నారు. మంగళవారం మండలంలోని నేరడగంలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన  పార్టీ కార్యకర్తలతో కలిసి గ్రామంలో ఇంటింటికి వెళ్లి తనకు ఓట్లు వేసి గెలుపించాలని అభ్యర్థించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత కొంత కాలంగా స్థానికేతరులను గెలిపిస్తున్నామని, ఈ ఎన్నికల్లో మీ మధ్యలో ఉండి మీ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే నాయకుడిని ఎన్నుకోవాలని కోరారు. ప్రజలకు తాను అందుబాటులో ఉండి సేవ చేస్తానని తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. కార్యాక్రమంలో నాయకులు విద్యాసాగర్,జయానంద్‌రెడ్డి, కనకరాజు, ఆశోక్‌గౌడ్,నారాయణ తదితరులు ఉన్నారు. 
కృష్ణామండలంలోని చేగుంటలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సోమశేఖర్‌గౌడ్, మండల అధ్యక్షుడు ఉషెనప్ప అధ్వర్యంలో ఇంటింటా ప్రచారంను నిర్వహించారు. కార్యక్రమంలో నాయకలు బస్వరాజ్‌గౌడ,సురేష్,రెడ్డి తదితరులు ఉన్నారు. 


బీజేపీ గెలుపుతోనే 69 జీఓ అమలు 
ఊట్కూర్‌: ఎన్నికల్లో బీజేపీ అధికారం చేపడితే జీఓ 69 అమలు చేసి ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తామని తెలంగాణ విమోచన జిల్లా కన్వీనర్‌ విజయన్‌గౌడ్‌ అన్నారు.  సోమవారం రాత్రి పులిమామిడిలో ఐదు బూత్‌కమిటీల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ ప్రతి కార్యకర్త సైనికునిల్లా పనిచేసి బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. కేసీఆర్‌ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు. నిరుపేదలు ఇల్లులేక గుడిసెల్లో జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో తాగునీరు, సాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇందులో ఎంపీటీసీ శ్రీనివాసులు, సింగల్‌విండో డైరెక్టర్‌ సుదర్శన్‌రెడ్డి, నాయకులు దండు కృష్ణయ్య, జ్యోతి కృష్ణయ్య, మహావీర్, నక్క బాలప్ప, జ్యోతి మున్నా,  బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు