సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలని సందర్శించే ధైర్యం మంత్రులకు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రైస్ మిల్లర్లతో కుమ్మక్కై రైతులను దోపిడీ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణలోరైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై బీజేపీ నేతలు, గవర్నర్ తమిళిసైని కలిసి వినతి పత్రం సమర్పించారు. కరోనా నివారణకు రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తున్నామని, ధాన్యం కొనుగోలులో ఇబ్బందులపై నిలదీస్తే సీఎం కేసీఆర్ ఎగతాళి చేస్తున్నారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.