ప్రధాని నరేంద్ర మోదీ పేరు మీద పూజలు

17 Sep, 2019 14:01 IST|Sakshi

సాక్షి, పెద్దపల్లి :  తెలంగాణ విమోచన దినోత్సవం​(సెప్టెంబర్‌ 17) సందర్భంగా మంథని ఆర్‌డీవో కార్యాలయంలో బీజేపీ నాయకులు జాతీయ జెండాను ఎగరవేశారు. అలాగే ఆర్టీసీ మాజీ ఛైర్మన్‌ సోమారపు సత్యనారాయణ కూడా తెలంగాణ విమోచన దినోత్పవం సందర‍్భంగా గోదావరిఖనిలో జాతియ జెండాను ఎగురవేశారు. కాగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో ప్రధాని నరేంద్రమెదీ జన్మదినం పురస్కరించుకొని స్థానిక వేణుగోపాలస్వామి గుడిలో బీజేపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

మరిన్ని వార్తలు