ఆత్మకూరు(పరకాల): బీజేపీ పరకాల నియోజకవర్గ అభ్యర్థిగా డాక్టర్ పెసరు విజయచందర్రెడ్డి పేరు ఎట్టకేలకు ఖరారైంది. శనివారం రాత్రి ఢిల్లీలో బీజేపీ బోర్డు సమావేశం అనంంతరం 31 మంది అభ్యర్థుల పేర్లతో తొలి జాబితా విడుదల చేశారు. దీంట్లో డాక్టర్ విజయచందర్రెడ్డికి చోటు దక్కింది. ఈ స్థానానికి డాక్టర్ పెసరు విజయచందర్రెడ్డితో పాటు, డాక్టర్ సిరంగి సంతోష్, గుజ్జుల ప్రేమేందర్రెడ్డి కూడా పోటీ పడగా విజయచందర్రెడ్డికి అవకాశం లభించింది. ఈ విషయాన్ని తనకు డాక్టర్ లక్ష్మణ్ ఢిల్లీ నుంచి ఫోన్ చేసి తెలిపినట్లు డాక్టర్ విజయచందర్రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.