బాలుడి వలలో 15 కిలోల చేప

15 Aug, 2015 15:25 IST|Sakshi
బాలుడి వలలో 15 కిలోల చేప

చాదర్‌ఘాట్ (హైదరాబాద్) : నగరంలోని చాదర్‌ఘాట్ సమీపంలో ఉన్న మూసీ నదిలో 15 కిలోల చేపను స్థానికులు పట్టుకున్నారు. చాదర్‌ఘాట్‌కు చెందిన స్థానికులు మూసీ నదిలో చాపలు పట్టుకోవడం సాధారణ విషయం.

కాగా శనివారం చాదర్‌ఘాట్ సమీపంలో చేపలు పడుతున్న ఒక బాలుడి వలలో 15 కిలోల చేప చిక్కింది. దీంతో ఆ బాలుడు ఆనందంలో మునిగిపోయాడు. బాలుడు చేపను తీసుకొని వెళ్తుండగా 'సాక్షి' కెమెరాకు చిక్కాడు.
 

మరిన్ని వార్తలు