పిడుగుపాటుకు బాలుడు మృతి

2 May, 2016 18:24 IST|Sakshi
పిడుగుపాటుకు బాలుడు మృతి

చేవెళ్ల (రంగారెడ్డి) : చేవెళ్ల మండలం పామెన గ్రామంలో పిడుగుపాటుకు ఒక బాలుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన వడ్డే అంతయ్య, అంజమ్మల కుమారుడు నవీన్(15) సోమవారం సాయంత్రం తల్లిదండ్రులతో కలసి పొలానికి వెళ్లాడు. కొద్దిసేపటికి ఉరుములు, మెరుపులతో వాన మొదలైంది. అంతలోనే చేలో ఉన్న బాలుడిపై పిడుగుపడింది. కొద్దిదూరంలోనే ఉన్న తల్లిదండ్రులు అక్కడికి చేరుకునే సరికే అతను మరణించాడు. దీంతో వారి రోదనకు అంతేలేకుండా పోయింది.

మరిన్ని వార్తలు