సంగారెడ్డి(మెదక్ జిల్లా): మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం కంది గ్రామంలో జాతీయరహదారిపై ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని కొంతమంది గుర్తుతెలియని దుండగులు శుక్రవారం తెల్లవారుజామున ధ్వంసం చేశారు. విషయం గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విగ్రహాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి ఈ చర్యకు పాల్పడ్డ నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.