వాహనం ఢీకొని అన్నదమ్ముల దుర్మరణం..

20 Oct, 2015 19:49 IST|Sakshi

తాండూరు : రంగారెడ్డి జిల్లా తాండూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. బైక్‌పై లాలప్ప(25), ఆశప్ప(23)లు  తాండూరు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డీసీఎం వాహనం ఢీకొట్టిడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.

ఒకే కుటుంబంలో ఇద్దరు మృతిచెందడతో వీరి స్వగ్రామం చెంగోలులో విషాదం నెలకొంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తాండూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

>
మరిన్ని వార్తలు