యువకుడి దారుణ హత్య

15 Jun, 2015 20:38 IST|Sakshi

ఆదిలాబాద్ : గుర్తుతెలియని దుండగులు ఓ యువకుడిని రాళ్లతో మోది దారుణంగా హత్య చేసిన ఘటన ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి మండలం తాళ్లగురజాల గ్రామంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది.  వివరాల్లోకి వెళ్తే.. తాళ్లగురజాల గ్రామానికి చెందిన గంగారాం అనే యువకుడిని నడిరోడ్డు మీదే కొంత మంది దుండగులు రాళ్లతో కొట్టి చంపేశారు. ఈ హత్యకు పాత కక్షలే కారణమని స్థానికులు అనుమానిస్తున్నారు.

మరిన్ని వార్తలు