కరీంనగర్ : గుర్తుతెలియని యువకుడు(27) దారుణ హత్యకు గురయ్యాడు. కరీంనగర్ జిల్లా మాల్యాల మండలం నూకపల్లి గ్రామ శివారులో బుధవారం రాత్రి కిరాతకంగా గొంతు కోసి చంపారు కొందరు దుండగులు.
కాగా ఈ దారుణాన్ని గురువారం ఉదయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.