ఆరు బయట నిద్రిస్తుండగా.. దారుణ హత్య

29 May, 2015 07:11 IST|Sakshi

జోగిపేట (మెదక్): ఇంటి ఆరు బయట నిద్రిస్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. ఈ ఘటన మెదక్ జిల్లా జోగిపేటలోని శివాజీరోడ్డులో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగింది. హమాలీగా పనిచేసే ఆంజనేయులు (30)ను దుండగులు గొడ్డలితో మెడపై నరికేశారు. స్థానికులు శుక్రవారం ఉదయం పోలీసులకు సమాచారం అందించగా, వారు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

మరిన్ని వార్తలు