పెర్కిట్: ఆర్మూర్ మండలం ఫత్తేపూర్ గ్రామంలో విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న బుర్రకథ అలరిస్తోంది. బోధన్కు చెందిన కళాకారులు ప్రభాకర్, లింగం, లక్ష్మణ్లు వీర బ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్రను బుర్రకథ ద్వారా తెలియజేస్తున్నారు. జానపద కళాకారుల సంఘ కోశాధికారి జిందం నరహరి, విశ్వబ్రాహ్మణ కులస్తులు వడ్ల శ్రీనివాస్, కృష్ణంరాజు, సాగర్, ప్రసాద్, విఠల్, వీడీసీ సభ్యులు గడ్డం గంగారెడ్డి, వార్డు సభ్యులు రాజేశ్లు పాల్గొన్నారు.