నగరంలో రోడ్డెక్కని ఆర్టీసీ బస్సులు..

2 Apr, 2015 10:06 IST|Sakshi
నగరంలో రోడ్డెక్కని ఆర్టీసీ బస్సులు..

హైదరాబాద్ : వేతన సవరణ (పీఆర్సీ) ప్రధాన డిమాండ్‌గా గురువారం ఆర్టీసీ బస్ భవన్ ముట్టడి కార్యక్రమంలో భాగంగా నగరంలో పలు చోట్ల బస్సులు నిలిచిపోయాయి. రాజేంద్రనగర్ డిపోలో దాదాపు 150 బస్సులు నిలిపివేశారు. రంగారెడ్డి, హైదరాబాద్ లో పలు ఆర్టీసీ సర్వీసులు నిలిచిపోనున్నాయి. వేతన సవరణ డిమాండ్ల నేపథ్యంలో బస్సు సర్వీసులు నిలిచిపోవటంతో పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు ప్రయివేటు వాహనదారులు సందడిలో సడేమియాలాగా ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు