భక్తులకు సరిపడా బస్సులు : ఆర్టీసీ ఎండీ

19 Jul, 2015 00:53 IST|Sakshi
భక్తులకు సరిపడా బస్సులు : ఆర్టీసీ ఎండీ

 తొర్రూరు : పుష్కర భక్తులకు ప్రతీ డిపో నుంచి సరిపడా బస్సు సర్వీసులు న డిపిస్తున్నామని ఆర్టీసీ ఎండీ జీబీ రమణారావు తె లిపారు. శనివారం తొర్రూరు డిపోలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఇ ప్పటికే 2,341 బస్సు ద్వారా సుమారు 3.65 లక్షల మంది భక్తులను పుష్కరాలకు తరలించామన్నారు. ప్రధానంగా భద్రాచలానికి 808, కాళేశ్వరానికి 542, ధర్మపురికి 422 బస్సులు నడిపిస్తున్నామన్నారు. పు ష్కర స్నానాలు ఆచరించిన 2.58లక్షల మందిని 1.422 బస్సుల ద్వారా గమ్యస్థానాలకు చేర్చామన్నారు. ఈనెల 25వ తేదీ వరకు బస్సులను అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. ఈసందర్భంగా కా ర్మిక సంఘాల నాయకులు ఎండీ రమణా రావును పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు.

మరిన్ని వార్తలు