- ఐదుగురికి గాయాలు
వరంగల్: నగరంలోని భద్రకాళి ఆలయ సమీపంలో బుధవారం ఉదయం ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ కారు అదుపు తప్పి ఆలయం వద్ద ఉన్న భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఇద్దరు పిల్లలు ఉన్నారు. క్షతగాత్రులను వెంటనే నగరంలోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.