సాక్షి, మేడ్చల్: ఘట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఓ కారు ప్రమాదానికి గురైంది. వేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బుధవారం ఉదయం రోడ్డుపైన పల్టీ కొట్టింది. దీంతో ఒక్కసారిగా కారులో మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో కారు పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ శ్రీరామరాజు తలకు గాయలయ్యాయి. చికిత్స నిమిత్తం డ్రైవర్ను 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. రోడ్డుపై అడ్డంగా ఉన్న కారును తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు.