యువతి అదృశ్యంపై కేసు నమోదు

13 Dec, 2015 08:48 IST|Sakshi

మాదాపూర్: హైదరాబాద్లో యువతి అదృశ్యమైన ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ రంజిత్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం జైపూర్‌కి చెందిన సస్రీ నిర్లిప్త(24) నిరుద్యోగురాలు. మాదాపూర్‌లోని గుట్టల బేగంపేట సైబర్‌హిల్స్‌లో తన అన్నయ్య ఇంట్లో నివాసముంటుంది. ఈ నెల 10వ తేదీన ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన సస్రీ నిర్లిప్త తిరిగి రాకపోవడంతో ఆమె అన్నయ్య పరంజిత్ దాస్ స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

మరిన్ని వార్తలు