విద్యుత్ తీగలు తెగి పడి పశువుల మృతి

9 May, 2016 11:33 IST|Sakshi

కల్హర్: మెదక్ జిల్లాలో విద్యుత్ తీగలు తెగిపడిన ఘటనలో 23 పశువులు చనిపోయాయి. కంగ్టి మండలంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ముగ్గురు రైతులు సుమారు 100 పశువులను అంతర్గామ్ గ్రామానికి తీసుకొచ్చారు. పొలాల్లో పశువులు ఉండగా... ఆదివారం రాత్రి గాలిదుమారానికి 11కేవీ విద్యుత్ తీగలు తెగి వాటిపై పడిపోయాయి. విద్యుదాఘాతంతో 22 ఆవులు, ఒక గేదె అక్కడిక్కడే చనిపోయాయి. ప్రభుత్వం తమను ఆదుకోవాలని పశువుల యాజమానులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు