నేడు 44 వేల ర్యాంకు వరకు వెరిఫికేషన్‌ 

16 May, 2018 02:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు మంగళవారం నిర్వహించిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు 22 వేల ర్యాంకులోపు విద్యార్థులు 6,633 మంది హాజరైనట్లు పాలీసెట్‌ కన్వీనర్‌ నవీన్‌ మిట్టల్‌ తెలిపారు. నేడు 22,001 ర్యాంకు నుంచి 44 వేల ర్యాంకు వరకు వెరిఫికేషన్‌ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వెరిఫికేషన్‌కు హాజరైన విద్యార్థులు ఈనెల 21వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని వెల్లడించారు. 

మరిన్ని వార్తలు