సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి హోదాను, హుందాతనాన్ని మరిచిపోయి సీఎం కేసీఆర్ విపక్షాలపై చేసిన విమర్శలకు సంస్కారహీనమైన భాష వాడారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. తన అధికార అహాన్ని, దర్పాన్ని ప్రదర్శించారే తప్ప ఒక నిజాయితీగల రాజకీయవేత్తగా వ్యవహరించలేదని విమర్శిస్తూ చాడ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు.
విపక్షాలు లేవనెత్తే ప్రశ్నలకు సీఎం రాజకీయ సమాధానం ఇచ్చే ధైర్యం తెచ్చు కోవాలని, వ్యక్తిగత దాడులు రాజ కీయ దివాలాకోరుతనానికి నిదర్శ మని దుయ్యబట్టారు. కమ్యూ నిస్టులది వీరచరిత అని, అధికారం కోసం ఏ గడ్డి అయినా కరువా లన్నది కేసీఆర్ సిద్ధాంతమని విమర్శించారు. పదవులను అనుభవిస్తూ.. త్యజించానని కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారని, మరి ప్రాణాలను త్యాగం చేసిన వారి మాటేమిటని ప్రశ్నించారు.