బాసర(ముథోల్): చదువుల తల్లి శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారిని చాగంటి కోటేశ్వరరావు శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయాధికారులు, అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రత్యేకాధికారి అన్నాడి సుధాకర్రెడ్డి ఆయనకు అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. వీరి వెంట ఆలయ చైర్మన్ శరత్పాఠక్, పాలకవర్గసభ్యులు ఉన్నారు.