బోయిన్‌పల్లిలో చైన్ స్నాచింగ్

31 Dec, 2015 14:11 IST|Sakshi

రోడ్డు మీద నుంచి నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలోంచి గుర్తు తెలియని ఇద్దరు దుండగులు బంగారు గొలుసు లాక్కెళ్లారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా బోయిన్‌పల్లి మండలం తమ్మంపల్లి గ్రామంలో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. గ్రామానికి చె ందిన పులి మంజుల(32) బీడీల ఫ్యాక్టరీకి వెళ్లి వస్తున్న సమయంలో బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోని రెండు తులాల బంగారు గొలుసు లాక్కెళ్లారు. దీంతో బాదితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.


 

>
మరిన్ని వార్తలు