ప్రెస్ కాలనీలో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు

26 Jun, 2015 11:34 IST|Sakshi
ప్రెస్ కాలనీలో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు

హైదరాబాద్: హైదరాబాద్ నగర శివారులో చైన్ స్నాచర్లు మరోసారి రెచ్చిపోయారు. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రెస్ కాలనీలో శుక్రవారం నడిచి వెళ్తున్న ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును హోండా యాక్టివాపైన వచ్చిన ఆగంతకులు తెంచుకెళ్లారు.

అనంతరం వాహనంపై పరారైయ్యారు. దాంతో బాధితురాలు భాగ్యలక్ష్మి స్థానికుల సహాయంతో వారిని వెంబడించారు. కానీ ఫలితం లేకపోయే సరికి... ఆమె సరూర్ నగర్ ఫోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు