హుస్నాబాద్‌లో చైన్ స్నాచింగ్

10 Jun, 2016 15:58 IST|Sakshi

హుస్నాబాద్ (కరీంనగర్) : రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును లాక్కెళ్లిన సంఘటన కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ శనిగారంలో శుక్రవారం చోటుచేసుకుంది. లాసమవ్వ అనే మహిళ రోడ్డు పై నుంచి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆమె మెడలోని 3 తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మరిన్ని వార్తలు