ఎంపీలను సస్పెండ్ చేశారని.. గుండుతో నిరసన

7 Aug, 2015 15:38 IST|Sakshi

నల్లగొండ(సూర్యాపేట): పార్లమెంట్ సమావేశాలకు రాకుండా కాంగ్రెస్ ఎంపీలను స్పీకర్ సస్పెండ్ చేయడంపై ఓ అభిమాని మనస్తాపానికి గురయ్యాడు. సస్పెండుపై స్పందిస్తూ.. గుండు చేయించుకుని వినూత్నంగా నిరసన తెలిపాడు. నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెందిన రాహుల్ గాంధీ జన జాగృతి జాతీయ అధ్యక్షుడు రిక్షా చంద్రశేఖర్, తెలంగాణ తల్లి విగ్రహం ఎదుటు గుండు గీయించుకుని నిరసన తెలిపారు.

మరిన్ని వార్తలు