మిలాదునబి సెలవుల్లో మార్పు

24 Nov, 2017 21:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఈద్‌ మిలాదునబి సందర్భంగా ఇంతకు ముందు ప్రకటించిన సెలవులో తెలంగాణ ప్రభుత్వం మార్పు చేసింది. వచ్చే నెల 2వ తేదీన నెలవంక కనిపించే అవకాశం ఉన్నందున ఆ రోజునే సెలవు ప్రకటించాలని రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు స్పందించిన ప్రభుత్వం.. ముందుగా ప్రకటించిన ఒకటో తేదీ(శుక్రవారం) కాకుండా శనివారం 2వ తేదీన సాధారణ సెలవుగా ప్రకటించింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖలకు శుక్రవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేసింది.

మరిన్ని వార్తలు