భీమారం : టీడీపీ స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ కట్టా మనోజ్రెడ్డిపై హసన్పర్తి పోలీస్స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. వివరాలిలా ఉన్నాయి. పైడిపల్లికి చెందిన సం దీప్రెడ్డికి చెందిన సుమారు 18 ఎకరాల భూమిని కట్టా మనోజ్రెడ్డి పదేళ్ల క్రితం ఖరీదు చేశాడు. ఈ క్రమం లో 2006లో హైదరాబాద్లో అతడిపై 150 చీటింగ్ కేసులు నమోదయ్యా యి. దీంతో మనోజ్రెడ్డి కొనుగోలు చేసిన ఆస్తులను ప్రభుత్వానికి అటాచ్డ్ చేస్తూ కోర్టు గతంలోనే ఆదేశాలు జారీ చేసింది.
తదుపరి ఉత్తర్వులు వెలువడేవర కు ఈ భూములు క్రయ, విక్రయాలు జరపొద్దని అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ భూముల్లో పైడిపల్లికి చెంది న 18 ఎకరాల భూమి కూడా ఉంది. ఈ భూమిని మనోజ్రెడ్డి ఇటీవల విక్రయానికి పెట్టాడు. దేవేందర్రెడ్డి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారితో ఆ భూమి విక్రయానికి రూ.5.50 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. తొలుత దేవేందర్రెడ్డి అడ్వాన్స్గా రూ.1.50 కోట్లు చెల్లించాడు. దీనిపై స్థానిక నాయకుడు ఒకరు హసన్పర్తి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా హసన్పర్తి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.