ప్రారంభమైన చేప ప్రసాద పంపిణీ

8 Jun, 2019 20:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో శనివారం సాయంత్రం నుంచి చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమయ్యింది. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన చేప ప్రసాదం పంపిణీ రేపు సాయంత్రం ఆరు గంటల వరకూ కొనసాగనున్నట్లు బత్తిని సోదరులు తెలిపారు. చేప ప్రసాదం కోసం దేశం నలుమూలల నుంచి వచ్చిన జనాలతో ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌ కిక్కిరిసిపోయింది. చేప ప్రసాదం కోసం ఈ రోజు 32 వేల చేప పిల్లలను సిద్ధం చేసిన మత్స్య శాఖ రేపు సాయంత్రం వరకూ మరో 1.28 లక్షల చేప పిల్లలను సిద్ధం చేయనున్నట్లు తెలిపింది. 32 కేంద్రాల ద్వారా చేప ప్రసాద పంపిణీ జరుగుతుందన్నారు.

మరిన్ని వార్తలు