చికెన్ గొంతులో ఇరుక్కొని ఊపిరాడక వ్యక్తి మృతి

10 Mar, 2015 02:47 IST|Sakshi

లక్ష్మణచాంద: ఆదిలాబాద్ జిల్లా లక్ష్మణచాంద మండలంలోని కనకాపూర్ కు చెందిన పెద్దలింగన్న (57) భోజనం చేస్తుండగా చికెన్ ముక్క గొంతులో ఇరుక్కుని మృతిచెందాడు. లింగన్న గ్రామంలోనే పశువుల కాపారిగా పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయం పశువులకు కాపాలాగా వెళ్లాల్సి ఉందని తొందర తొందరగా భోజనం చేస్తున్నాడు. ఆ క్రమంలోనే చికెన్ ముక్క గొంతులో ఇరుక్కొని ఊపిరాడక చనిపోయూడు. లింగన్నకు భార్య, ఓ కొడుకు ఉన్నారు.

మరిన్ని వార్తలు