రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి

26 Dec, 2015 14:27 IST|Sakshi

కరీంనగర్ జిల్లా కథలాపూర్ మండలం పెక్కెర్ల గ్రామంలో ట్రాక్టర్‌పై నుంచి పడి చిన్నారి మృతి చెందాడు. శనివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. జెవిడి పవన్ (11) ట్రాక్టర్ మట్టితో వెళుతున్న ట్రాక్టర్‌పై కూర్చున్నాడు. మూలమలుపు వద్ద జారి కింద పడిపోవడంతో అతడి తలపై నుంచి ట్రాక్టర్ ముందుకు వెళ్లింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో డ్రైవర్ లక్ష్మీనారాయణ అక్కడి నుంచి పరారై పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సమాచారం అందించాడు. పవన్ విజ్ఞాన భారత్ స్కూల్లో ఐదవ తరగతి చదువుతున్నాడు.


 

మరిన్ని వార్తలు