మమ్మీ.. మాస్క్‌..

2 May, 2020 07:51 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో:సికింద్రాబాద్‌ ప్యాట్నీసెంటర్‌ పరిధిలోని ఓ పోస్టాఫీస్‌ వద్ద శనివారం రూ.1500 నగదు తీసుకునేందుకు వచ్చిన ఓ మహిళ..తన వెంట చిన్నారిని తీసుకువచ్చింది. ఆమె నగదు కోసం లైన్‌లో ఉండగా...చిన్నారి పరిసరాల్లో మాస్క్‌ లేకుండా తిరుగుతుండడం చూసి ఓ కానిస్టేబుల్‌ వారి దగ్గరకు వచ్చాడు. ‘వెళ్లి మాస్క్‌ కట్టుకో పో..’ అని హెచ్చరించాడు. దీంతో ఆ చిన్నారి వెంటనే తన తల్లిదగ్గరికి వెళ్లి మాస్క్‌ కట్టించుకున్నాడు. ఈ దృశ్యాన్ని అక్కడి వారు ఆసక్తిగా తిలకించారు.

సామాజిక దూరం ఎక్కడా..?
కరోనా వ్యాప్తి కారణాలు తెలిసినప్పటికీ పాతబస్తీలోని పేట్లబురుజు ఆసుపత్రిలోశుక్రవారం వైద్య పరీక్షల కోసం భౌతిక దూరం పాటించకుండా క్యూలో నిలుచున్న గర్భిణులు

మరిన్ని వార్తలు