బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత అందరిదీ

14 Nov, 2014 23:42 IST|Sakshi

 పెద్దశంకరంపేట : బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని జోగిపేట జూనియర్ సివిల్ జడ్జి రమాకాంత్ అన్నారు. శుక్రవారం పేట పోలీస్‌స్టేషన్‌లో బాలల సహాయ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. బాలల దినోత్సవం సందర్భంగా ఈ కేంద్రాలను ఏర్పాటు చేయడం శుభ పరిణామమన్నారు. సమాజంలో బాల నేరస్తులు ఉండరాదన్నారు. బాలలను నేరస్తులుగా చూడొద్దని, వారిపై నేరస్తులన్న ముద్ర వేయకుండా చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు.

 మెగా లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి : డిసెంబర్ 6న దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న మెగా లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలని జడ్జి రమాకాంత్ పిలుపునిచ్చారు. అన్ని కోర్టుల్లో ఈ అదాలత్ ద్వారా పెండింగ్ కేసులను రాజీ చేసుకునే అవకాశం ఉందన్నారు.  కార్యక్రమంలో జోగిపేట సీఐ రఘు, పేట ఎస్‌ఐ మహేష్ గౌడ్, న్యాయవాదులు భాస్కర్, లింగం, ఎస్‌హెచ్‌ఓ లక్ష్మణ్, చిరంజీవి, విఠల్ గౌడ్, ప్రేమ్, శ్రీనివాస్‌గౌడ్ తదితరులున్నారు.

మరిన్ని వార్తలు