జేఎన్‌ఏఎఫ్‌ఏయూ ఇన్‌చార్జి వీసీగా చిత్రా రామచంద్రన్‌

29 Mar, 2020 03:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ (జేఎన్‌ఏఎఫ్‌ఏయూ) ఇన్‌చార్జి వైస్‌ చాన్స్‌లర్‌గా (వీసీ) విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నెల రోజుల కిందటే రాష్ట్రంలోని యూనివర్సిటీలకు ఇన్‌చార్జి వీసీలను నియమించిన ప్రభుత్వం జేఎన్‌ఏఎఫ్‌ఏయూకు నియమించలేదు. ఎట్టకేలకు ఆ వర్సిటీకి కూడా ఇన్‌చార్జి వీసీని నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.  

మరిన్ని వార్తలు