వర్ని: నిజామాబాద్ జిల్లా వర్ని మండలం రుద్రూరులోని వీరభద్ర ఆయిల్ మిల్లును గురువారం పౌర సరఫరాల శాఖ అధికారులు తనిఖీ చేశారు. ఆయిల్ నమూనాలను సేకరించారు. మిల్లులో ఆయిల్ కల్తీ జరుగుతున్నట్లు తమకు ఫిర్యాదు అందిందని ఏఎన్వో తెలిపారు. నమూనాలను ల్యాబ్కు పంపి పరీక్షలు చేయించనున్నట్లు వివరించారు.