బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా శిక్షణకు నేడు ఎంట్రన్స్

16 Nov, 2014 02:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల అధ్యయన కేంద్రాల (బీసీ స్టడీసర్కిళ్ల) ద్వారా సివిల్స్ ప్రిలిమ్స్‌కు ఉచిత శిక్షణ కోసం  ఆదివారం ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఆన్‌లైన్‌లోనే ఈ ప్రవేశపరీక్ష (స్క్రీనింగ్ టెస్ట్)ను నిర్వహించనున్నారు. ఇందులో ఉత్తీర్ణులైన వారికి హైదరాబాద్ (60 సీట్లు), కరీంనగర్ (40 సీట్లు), వరంగల్ (40 సీట్లు)  బీసీ స్టడీసర్కిళ్ల ద్వారా సివిల్స్ ప్రిలిమ్స్‌కు ఉచితంగా శిక్షణనిస్తారు. ఈ పరీక్షకు మొత్తం 2,600 దరఖాస్తులు వచ్చాయని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ ఇన్‌చార్జి డెరైక్టర్ ఆలోక్‌కుమార్ ‘సాక్షి’కి తెలిపారు.

>
మరిన్ని వార్తలు