హజ్‌ యాత్రికులకు తరగతులు

7 Mar, 2018 02:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: ఈ ఏడాది హజ్‌ యాత్రకు వెళ్లేవారికి ఈ నెల 11న శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ వక్ఫ్‌ బోర్డు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆ రోజు ఉదయం 10.30 నుంచి 4 గంటల వరకు అంబర్‌పేటలోని జామా మసీదులో ఈ తరగతులు జరుగుతాయని బోర్డు చైర్మన్‌ మహ్మద్‌ మసుల్లా ఖాన్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు