హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెపై తెలంగాణ సీఎం కేసీఆర్ అనూహ్యంగా స్పందించారు. ఆర్టీసీ కార్మికులకు బంఫర్ ఆఫర్ ప్రకటించారు. కార్మికులు కోరిన దానికంటే ఒకశాతం అదనంగా ఫిట్ మెంట్ ఇచ్చేందుకు అంగీకరించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. దీంతో తెలంగాణ ఆర్టీసీ కార్మికులు 44 శాతం ఫిట్ మెంట్ పొందనున్నారు.
ఏపీలో ఆర్టీసీ కార్మికులకు 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చేందుకు టీడీపీ సర్కారు అంగీకరించిన కొద్దిసేపటికే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.