‘రైతులను మోసం చేసి అధికారంలోకి వచ్చారు’

12 Sep, 2019 04:11 IST|Sakshi

చింతలపాలెం (హుజూర్‌నగర్‌): సీఎం కేసీఆర్‌ రైతులను మోసం చేసి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చా రని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు విస్మరించిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై నిరస న తెలుపుతూ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో సూర్యా పేట జిల్లా హుజూర్‌నగర్‌ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా నిర్వహించా రు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ.. రైతుబంధు కింద ఖరీఫ్‌కు రూ.5 వేలు, రబీకి రూ.5 వేలు ఇస్తామని, ఆ తర్వాత మరిచి పోయారని విమర్శించారు.   

>
మరిన్ని వార్తలు