కేంద్రానికి సంబంధం లేదు

18 Mar, 2017 04:07 IST|Sakshi
కేంద్రానికి సంబంధం లేదు

జిల్లాల విభజనపై ముఖ్యమంత్రి స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్‌: జిల్లాల విభజనకు కేంద్రానికి సంబం ధంలేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టంచేశారు. ఇది రాష్ట్రాలకు సంబంధించిన అంశమన్నారు. జిల్లాలను 31గా విభజించడంపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పిందని.. అంగీకారం తెలపలేదంటూ ఇటీవల ఒక టీవీ చానల్‌లో వచ్చిన కథనాన్ని శుక్రవారం అసెంబ్లీలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ లేవనెత్తగా సీఎం కలుగజేసుకొని సమాధానమిచ్చారు. అత్యుత్సాహపు మీడియా ఏదేదో చేస్తుందని... ఉన్నదీ లేనిదీ చెపుతుందని.. అది తప్పుడు కథనమని స్పష్టంచేశారు.

మరిన్ని వార్తలు